15 June, 2026 | 11:38 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మొదటి విడత పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

11-12-2025 12:00 AM

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

కోనరావుపేట డిసెంబర్ 10 (విజయక్రాంతి ):కోనరావుపేట మండలంలో జరు గుతున్న మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు పురస్కరించుకొని బందోబస్త్ కు వచ్చిన పోలీస్ సిబ్బందికి ఆయా పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..పోలింగ్ జరుగు సమయంలో, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల ను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ఎన్నికల సమ యంలో రూట్ మొబైల్ పోలీస్ అధికారులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ,పోలింగ్ కేంద్రాలు,ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు.ఏదైన సమ స్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులకు సమచారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట పోలీస్ అధికారు లు,సిబ్బంది ఉన్నారు.