4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

తాతల తండ్రుల కాలం భూములకు హక్కుపత్రాలు కల్పించాలి

17-07-2025 05:34 PM

వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): తాతల తండ్రుల  కాలంలో తమ పూర్వీకులు సంపాదించిన భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని మాల మహానాడు మండల మాజీ అధ్యక్షుడు సాధనపల్లి చిట్టిబాబు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం  ఆవరణలో మంచాల భూషణం అధ్యక్షతన  జరిగిన మాల మహానాడు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో సమానంగా సంవత్సరాల కాలంగా పోడు భూములకు సాగు చేసుకుంటున్నా తమకు భూభారతిలో దరఖాస్తు మేరకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహస్తం కొనసాగించాలి అని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.