26 March, 2026 | 12:23 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో ఎన్నో పోరాటాలు..

08-10-2025 06:35 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో అధ్యక్షునిగా సంద అశోక్ ఎన్నో పోరాటాలు చేసి ఉద్యోగులకు అండగా నిలిచారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు వనజ రెడ్డి అన్నారు. ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖలో సూపరింటెండెంట్ గా పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్ ను ఆమె బుధవారం స్థానిక సంఘ భవనంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వనజ రెడ్డి మాట్లాడుతూ... సంద అశోక్ టీఎన్జీవో యూనియన్ ను బలోపేతం కోసం కృషి చేశారన్నారు. సుదీర్ఘకాలం పాటు అధ్యక్షునిగా పని చేశారని గుర్తు చేశారు.

అనంతరం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన వనజ రెడ్డిని టీఎన్జీవో యూనియన్ నాయకులు పుష్పగుచ్చం, మెమెంటో అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. నవీన్ కుమార్, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు శివ కుమార్, కార్యదర్శి రామరావు, టీఎన్జీవో యూనియన్ రాష్ట్ర బాధ్యులు తిరుమల రెడ్డి, సంఘ సభ్యులు రాజేశ్వర్, అరుణ్, శ్రీనివాస్, మేదరి నవీన్, కలీమ్, సోహాలు, రామ్ మోహన్, రజినీకాంత్, వివిధ శాఖల ఉద్యోగులు, సంఘ బాధ్యులు  పాల్గొన్నారు.