15 June, 2026 | 6:33 PM

Breaking News

ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •   ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •  

బీసీ బంద్‌లో పాల్గొన్న టీపీసీసీ

18-10-2025 02:30 PM

హైదరాబాద్: బీసీ బంద్‌లో భాగంగా అంబర్‌పేట్ చౌరస్తా సమీపంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Telangana Pradesh Congress Committee) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో బంద్ విజయవంతమైందని అన్నారు. "బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ చూపినంత నిజాయితీ మరే పార్టీకి లేదు" అని మహేష్ గౌడ్ అన్నారు. "మేము కుల సర్వే నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) జారీ చేసాము.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో, బీసీ బిల్లుకు ఆమోదం పొందేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తాము." రాష్ట్ర ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ కోటాతో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని, అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. అంబర్ పేటలోని ప్రధాన కూడలి నుంచి తెలంగాణ జేఏసీ బీసీ బంద్ కి మద్దతుగా మోత రోహిత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు రోహిన్  రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.