15 June, 2026 | 7:41 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

బంద్‌లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

18-10-2025 02:42 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్(Telangana BC Bandh) కొనసాగుతోంది. బీసీ సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, ఆమన్ గల్ లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పార్టీ నాయకులు,శ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ వద్ద జరిగిన బీసీ బంద్‌లో టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్(TPCC Chief B. Mahesh Kumar), మంద కృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని వెనుకబడిన తరగతుల (బీసీ) యువత రిజర్వేషన్లలో తమకు రావాల్సిన వాటాను డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి శుక్రవారం ఖైరతాబాద్ జంక్షన్‌లో మానవహారం నిర్వహించింది. జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర జరిగిన బీసీ బంద్‌లో  పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.