21 April, 2026 | 6:33 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

8లోపు వాణిజ్య ఒప్పందం

01-07-2025 12:00 AM

న్యూఢిల్లీ, జూన్ 30: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పం దం తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. జూలై 8 లోపు ఎ ప్పుడైనా దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ ఒప్పందంపై తుది విడత చర్చలు జరిపేందుకు ఇప్పటికే వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ట్రంప్ కొత్తగా విధించిన సుంకాలు జూలై 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

సుంకాల గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని ట్రంప్ మీడియాకు తెలిపారు. ఏప్రిల్‌లో ట్రంప్ భారత్‌పై 26శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆ సుంకాలను జూలై 9 వరకు నిలుపుదల చేస్తూ తర్వాత ప్రకటించారు. ట్రంప్ విధించిన గడువుకంటే ముందే నూతన వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది.