2 June, 2026 | 12:15 PM

Breaking News

పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్   •   అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు   •   పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •   తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు   •   ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో ఇద్దరు మృతి   •   తెలంగాణ బలానికి, ఆశయాలకు ప్రతీక: నితిన్ నబిన్   •   ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •  

భీమవరంలో ట్రాఫిక్ జామ్

13-01-2026 02:11 AM

అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పండగకి హైదరాబాద్ తదితర నగరాల్లో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వచ్చే వాహనాలతో నగర, పలు పట్ణణ రహదారులపై తీవ్ర రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రహదారులు అన్నీ సోమవారం ఉదయం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. కొన్నచోట్ల పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపో యింది. ముఖ్యంగా భీమవరం చినవంతెన నుంచి రెండు కిలోమీటర్లు పొడవునా ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. ప్రకాశం చౌక్, అంబేద్కర్ కూడళ్లలో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.