10 April, 2026 | 7:22 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

ఉపాధ్యాయులు కాలానికనుగుణంగా బోధించాలి: ఏంఈఓ శైలజ

13-10-2025 07:03 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు మారుతున్న కాలానికనుగుణంగా నూతన బోధన పద్ధతులను అవలంభించాలని మండల విద్యాధికారి శైలజ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల/కళాశాలలో జన్నారం, దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సృజనత్మాకత తో కూడిన బోధన పద్ధతులు విద్యార్థులకు జీవితాంతం గుర్తు ఉంటాయని, ఉపాధ్యాయులు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ లో  బోధన ప్రమాణాలు ఎంతో అవసరమని ఆమె వివరించారు.

ఏ బుక్ ఆన్ డిజిటల్ లీటరసీ గురించి మూడు రోజులు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నా మార్పులకనుగుణంగా తమను తాము మలచుకోవాలని హితబోధ చేశారు. గురుకుల పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రమ కళ్యాణి, ఎస్ ఆర్పీ లు రాజన్న, అంజన్న, ఆర్పీ లు ఏం శ్రీనివాస్,ఎన్ శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.