12-05-2025 08:27:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం నర్సుల దినోత్సవం జరుపుకున్నారు. ఆస్పత్రి సూపర్డెంట్ గోపాల్ సింగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నర్సులకు స్వీట్లు తినిపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు పాత్రను రోగులు ఎప్పుడు మరిచిపోరని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.