11 April, 2026 | 11:34 PM

కరెంట్ షాక్‌కు గురై రెండు ఎద్దులు మృతి

13-10-2025 07:29 PM

ఇల్లందు (విజయక్రాంతి): ఇల్లందు మండలం తొడితల గూడెం గ్రామంలో గత రాత్రి 10 గంటల సమయంలో శ్యాంలాల్ సాహూ అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాయి. ఆ రైతుకు అవే జీవనాధారమని అవి లేకుంటే వ్యవసాయం చేయలేనంటూ విలపించాడు. ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలని అధికారులను ఈ సందర్భంగా కోరాడు.