13-10-2025 07:29:25 PM
ఇల్లందు (విజయక్రాంతి): ఇల్లందు మండలం తొడితల గూడెం గ్రామంలో గత రాత్రి 10 గంటల సమయంలో శ్యాంలాల్ సాహూ అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాయి. ఆ రైతుకు అవే జీవనాధారమని అవి లేకుంటే వ్యవసాయం చేయలేనంటూ విలపించాడు. ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలని అధికారులను ఈ సందర్భంగా కోరాడు.