15 April, 2026 | 10:06 AM

పిడుగుపాటుకు రెండు పశువులు మృతి

04-11-2025 04:50 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో సమీప జామాయిల్ తోటలో మేత మేస్తున్న రెండు పశువులపై పిడుగు పడి రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు. బోడు గ్రామానికి చెందిన కేగర్ల నర్సయ్య, మాడే సంజీవకు చెందిన పశువులుగా గుర్తించారు.