15 April, 2026 | 4:35 AM

దేశాలు దాటి కలిసిన రెండు హృదయాలు

15-11-2025 09:00 PM

 నకిరేకల్‌లో రాజేష్–సుజాత రిజిస్టర్‌ మ్యారేజ్ 

నకిరేకల్,(విజయక్రాంతి): ​నల్గొండ జిల్లాలోని నకిరేకల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం శనివారం ఒక అందమైన ప్రేమకథకు సాక్ష్యమైంది. కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బాచుపల్లి రాజేష్, నేపాల్‌కు చెందిన సుజాత తప పరస్పర ప్రేమ, విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకున్నారు. ​కొన్ని సంవత్సరాల క్రితం దుబాయిలో పనిచేస్తున్న సమయంలో పరిచయమైన రాజేష్–సుజాతల పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

​సరిహద్దులు, భాషలు, సంప్రదాయాలు ఏవీ ప్రేమను అడ్డుకోలేవన్న నిజాన్ని ఈ జంట మరోసారి నిరూపించింది.​కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరిని ఆశీర్వదించగా… ఇలాంటి ప్రేమ వివాహాలు రెండు దేశాల మధ్య స్నేహాన్ని, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ​కొత్త జీవితాన్ని ప్రేమతో, పరస్పర గౌరవంతో ప్రారంభించిన రాజేష్ సుజాతల దంపతులకు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.