24-06-2025 01:19:45 PM
లయన్స్ క్లబ్ ఆఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.వి ప్రసాద్
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు లబిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.వి ప్రసాద్(Lions Club of Charitable Trust Chairman K.V. Prasad) అన్నారు. నల్లగొండకు చెందిన గౌతమి కళాశాల డైరెక్టర్ పుట్టా వెంకట్ రమణా రెడ్డి తండ్రి పుట్టా దశరధి రెడ్డి తిరుమల నగర్ లో తమ స్వగృహంలో అకాల మరణం పొందడంతో వైద్యులు నేత్రాలను మంగళవారం సేకరించారు.
ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు(Former IMA State Vice President Dr.Pullarao) మాట్లాడుతూ... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ సభ్యుల సహకారంతో ఈ నేత్రదాన ఉద్యమాన్ని అందరికీ చేరువయ్యే విధంగా తాము కృషి చేస్తున్నామని తెలిపారు. మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా, పార్థివదేహం ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని తెలిపారు.