12-09-2025 11:43:04 AM
ఛత్తీస్గఢ్: బీజాపూర్లో ఎన్కౌంటర్(Encounter) జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(Naxals) మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు 303 రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శోధన ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో గురువారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో కనీసం పది మంది నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిషిద్ధ సిపిఐ (Communist Party of India) సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు (సిసిఎం) మోడెమ్ బాలకృష్ణ మరణించిన వారిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లో ఉన్నప్పుడు కాల్పులు జరిగాయని రాయ్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా తెలిపారు. ఈ ఆపరేషన్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా పోలీసుల యూనిట్, కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ యూనిట్, ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.