15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

తమ్ముడి ఓటమి తట్టుకోలేక అక్క మృతి

13-12-2025 01:45 AM
  1. సర్పంచ్‌గా పోటీ చేసిన సోదరుడు 
  2. గంభీర్ పూర్ గ్రామంలో విషాదం

కోరుట్ల, డిసెంబర్ 12(విజయకాంతి): పంచాయతీ ఎన్నికల్లో తమ్ముడి ఓటమి తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కృష్ణ మండల కేంద్రానికి చెందిన కొక్కుల మమత (38) ప్రస్తుతం కోరుట్లలో ఉంటున్నారు.తన పుట్టినిల్లు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని గంభీర్‌ఫూర్ గ్రామంలో సోదరుడు పోతు రాజశేఖర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

తమ్ముడికి మద్దతుగా ఉండేందుకు మమత గ్రామానికి వచ్చారు. అయితే గురువారం వెలువడిన ఫలితాల్లో తమ్ముడు రాజశేఖర్ ఓటమి చెందడంతో మమత కలత చెందింది. ఈ క్రమంలో ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో కోరుట్లలోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్థారించారు. కాగా మమత భర్త ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లాడు. మృతురాలికి బిడ్డ, కొడుకు ఉన్నారు.