12 May, 2026 | 12:10 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

ఒకే చోట రెండు జాతీయ పతాకాల ఆవిష్కరణ!

17-09-2025 12:50 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం బోట గుట్ట తండా ప్రభుత్వ పాఠశాలలో ఒకేచోట అది పక్కపక్కనే రెండు జాతీయ పతాకాలను ఆవిష్కరించడం విచిత్రంగా మారింది. బోడ గుట్ట తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు గనె యాదగిరి ఒక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, మరో జాతీయ పతాకాన్ని పీక్లా తండా పంచాయతీ కార్యదర్శి నివాస్ ఆవిష్కరించారు. పీక్ల తండా పంచాయితీకి సొంత భవనం లేకపోవడంతో పాఠశాలలోనే ఒక గదిని కేటాయించారు. దీనితో ఒకేచోట రెండు జాతీయ పతాకాలను పక్కపక్కనే ఆవిష్కరించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.