30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రెవిన్యూ గ్రామాల వారీగా యూరియా సరఫరా

17-09-2025 03:29 PM

చివ్వెంల (విజయక్రాంతి): మండలంలో రేపటి నుండి యూరియా పంపిణీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నందు రెవెన్యూ గ్రామాల వారిగా ఇవ్వడం జరుగుతుంది. కావున రైతులు రెవెన్యూ గ్రామాల వారీగా సంబంధిత సొసైటీ దగ్గరకు వచ్చి యూరియా తీసుకెళ్లాలని ఎంఏఓ డి.వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఎన్.టి. ప్రకాష్ రావు కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చివ్వెంల నందు రెవెన్యూ గ్రామాలు చివ్వెంల, బిబి గూడెం, దురాజ్ పల్లి, పిఎసిఎస్ చందుపట్ల నందు రెవెన్యూ గ్రామాలు చందుపట్ల, తిమ్మాపురం పిఎసిఎస్ వట్టి ఖమ్మం పహాడ్ నందు రెవెన్యూ గ్రామాలు వట్టి ఖమ్మం పహాడ్, గాయం వారి గూడెం, ఐలాపురం పిఎసిఎస్ తిరుమలగిరి నందు రెవెన్యూ గ్రామాలు తిరుమలగిరి, గుంపుల, గుంజలూరు, వల్లభాపురం, తుల్జారావుపేట, ఉండ్రుగొండ పైన తెలిపిన రెవెన్యూ గ్రామాల రైతులు సంబంధిత సొసైటీ బ్రాంచ్ నందు మాత్రమే యూరియా తీసుకోగలరు. రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని స్వయంగా రావాలని తెలియజేయడం జరుగుతుంది. సంబంధిత సొసైటీ బ్రాంచ్ నందు యూరియా వచ్చే సమాచారం వ్యవసాయ విస్తరణ అధికారులు తెలియజేస్తారు. కావున రైతులు సహకరించాలని కోరారు.