10 May, 2026 | 11:41 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దుండిగల్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు...

17-09-2025 05:06 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గండిమైసమ్మ చౌరస్తా కార్యాలయం నందు మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాటి ఉప ప్రధాన కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని అలాంటి రాక్షస రజాకార్ల పాలన నుండి విముక్తి కల్పించారన్నారు.

నిజాం పాలనలో రజాకార్లు పన్ను చెల్లించని వారి చేతి గోర్లను ఊడగొట్టేవారని, ఇళ్లలోకి చొరబడి భర్తల కళ్లెదుటే భార్యలపై అత్యాచారం చేసిన దుర్మార్గపు పాలన అని గుర్తు చేశారు. అసలైన చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భవిష్యత్తు మనుగడకే ప్రమాదం ఉందని తెలిపారు. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి గోరమైన చరిత్ర కప్పిపుచ్చిన 60 ఏళ్ల నాటి అధికారం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.