10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఘనంగా విమోచన దినోత్సవం

17-09-2025 05:09 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ బిజెపి జిల్లా కార్యాలయంలో విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తెలంగాణ విమోచన సులభం కాలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్  సంకల్పం మరియు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో కారణంగా తెలంగాణ భారతదేశంలో విలీనం అయిందని, రాజాకార్లను,నిజాం పాలనను ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మనం శిరసు వంచి నివాళులు అర్పించామన్నారు.

గ్రామాల్లో రాజాకార్లు పన్నిన క్రూరకాండలు, తెలంగాణ మహిళలపై జరిగిన దారుణాలను మనం ఎప్పటికీ మరచి పోలేమని,ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్వహించాలని, ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలను వదిలి ప్రజల భావాలను గౌరవించాలి అని అన్నారు.