20-08-2025 09:13:02 PM
గణేష్ మండపాల వద్ద పోలీస్ శాఖ వారి అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి
డిజే నిర్వాహకులకు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ సూచనలు
బోయినపల్లి,(విజయక్రాంతి): అనుమతి లేకుండా వినాయక మండపాల వద్ద దీజేలు నిర్వహిస్తే డీజే యజమానులపై కఠినంగా తీసుకుంటున్నట్లు వేముల రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం బోయినపల్లి మండల పరిధిలోని డి.జే యజమనులతో పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించి డి.జే యజమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహలకు తగిన సూచనలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా డిజేలు నిర్వహించిన, యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కానీ, శోభయత్రలో కానీ డీజేలు కానీ యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన డిజే యజమానులతో పాటుగా నిర్వహకులపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
గణేష్ మండపాల వద్ద పోలీస్ అధికారుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అదికూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అని,అధిక శబ్దాలు చేసే డి.జే ల వలన చిన్న పిల్లలు,విద్యార్థుల చదువుకు,వృద్ధులు ఆరోగ్యనికి ఇబ్బంది కలుగుతుంది అని ప్రజలు శాంతి యుత వాతావరణం లో భక్తి శ్రద్దలతో వినాయక చవితి జరుపుకోవాలి ఆయన కోరారు.