4 July, 2026 | 11:24 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

డా.కవిత తొరన్ ను అభినందించిన వైస్ ఛాన్సలర్

23-07-2025 10:41 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. యాదగిరి రావు డా. కవిత తొరన్ ను అభినందించారు. ఓపెన్ సోర్స్ జిఐఎస్ టెక్నాలజీని అత్యుత్తమంగా ఉపయోగించినందుకు ఐఐటి బాంబే వారు ఈ నెల 17న డా. కవిత తోరాన్ కు జియోస్పేషియల్ ఫ్యాకల్టీ ఫెలో అవార్డు అందించారు. దేశంలోనే కేవలం 22 మంది అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారికి మాత్రమే ఈ అవార్డు లభిస్తుంది. ప్రస్తుతం ఆమె సౌత్ క్యాంపస్ జియో ఇన్ఫర్మేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అవార్డు అందుకున్న ఆమెకు యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ అవార్డు పొందడానికి సహాయ సహకారాలు అందించిన టి.యూ విసికి, రిజిస్ట్రార్ కు కృతజ్ఞతలు తెలిపారు.