02-07-2025 01:19:16 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై1 ( విజయకాంతి): పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో యువకుడు దారణ హత్యకు గురయ్యాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ అదే గ్రామానికి చెందిన వివాహిత తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే హత్యకు దారి తీసినట్లు తెలిసింది. రాజన్న తన భార్యతో శ్రీధర్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని అను మానంతో మంగళవారం శ్రీధర్ పై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేసిన రాజన్న పోలీసులకు లొంగిపోయాడు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.