17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మూడు రోజుల్లో మస్తానికుంటకు నీరు

11-05-2025 02:11 AM

- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

- మంచుకండ ఎత్తిపోతల పథకం పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 10 (విజయక్రాంతి): మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి మూడు రోజుల్లో మస్తానికుంటకు నీరు విడుదల చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

శనివారం మంత్రి రఘునాథపాలెం మండలం గడ్డికుంట వద్ద గల గ్రావిటీ 5 కెనాల్, భవోజితండా వద్ద గల గ్రావిటీ 5 కెనాల్, భావోజీ తండా వద్ద రేగులకుంట చెరువును సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ద్వారా చెరువులకు నీటి విడుదల చేపడుతున్నామన్నారు.

రేగుల కుంట చెరువు నుంచి నీరు సర్‌ప్లస్ అయి నల్లకుంట చెరువు, మల్లెపల్లికెంట చేరుకుంటాయన్నారు. 3 రోజుల వ్యవధిలో మస్తానికుంట, మంచుకొండకు నీరు విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ ప్రాజెక్టుతో 2,400 పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీ నర్సింహారావు, నీటిపారుదల శాఖ ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ ఉన్నారు.