13-08-2025 12:17:20 AM
ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, ఆగస్టు 12 ( విజయక్రాంతి ) : మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన 53 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల ను ఆపడం లేదని ఆయన గుర్తు చేశారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు, సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, మాధవ రెడ్డి, గోవింద్ యాదవ్, నాగరాజు, రాజు గౌడ్, పోతన్ పల్లి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.