22 June, 2026 | 2:38 PM

Breaking News

దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •  

కవిత పార్టీతో మాకు నష్టమేమీలేదు

06-01-2026 01:18 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైరదాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడితే తమకు వచ్చే ఎలాంటి నష్టం లేదని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని కవిత చేసిన వ్యాఖ్యలపై రాంచందర్‌రావు సోమవారం స్పందించారు.

ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చన్నారు. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో వారి కుటుంబ అంశమన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం వీబీ జీ రామ్ జీను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఆయన వ్యతిరే కించారు. ఉపాధి పథకంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ కోరుకుంటుందని విమర్శించారు.