04-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదల వల్ల పంట దెబ్బతిన్న రైతులను తప్పకుండా ఆదుకుంటామని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు.
బుధవారం దిల్వార్పూర్ నర్సాపూర్ మండలాల్లో పర్యటించి గండిపడ్డ దేవుడు చెరువు వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలిం చి రైతులను నష్టం అడిగి తెలుసుకు న్నారు. గండి పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు రమణారెడ్డి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.