calender_icon.png 13 June, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఊరుకోం

12-06-2025 08:09:58 PM

మాజీ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య...

లక్షెట్టిపేట (విజయక్రాంతి): బీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఊరుకోమని మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య(Former Municipal Chairman Nalmas Kantaiah) అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా, పాత బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ ప్లెక్సీలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి వాటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారన్నారు. మేం ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీ ఫ్లెక్సీ లు తొలగించామా? అని ప్రశ్నించారు.

మున్సిపల్ అధికారులు ఈ ఫ్లెక్సీ లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆగడాలను సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు. అనంతరం బి ఆర్ ఎస్ నాయకులు నిరసన తెలిపి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నట్లు వివరించారు. తమ ఫ్లెక్సీలను తొలగించి నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు మీడియా ద్వారా తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ శాతరాజు రాజన్న, మైనార్టీ నాయకులు  షేక్ చాంద్, శంకర్రావు, గడికొప్పుల సతీష్, పెట్టం తిరుపతి, చుంచు తిరుపతి, గోల్కొండ సత్తయ్య, జిన్ని వెంకటేష్, షాబు, ముత్తే తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.