14 June, 2026 | 4:25 PM

Breaking News

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •  

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం

17-10-2025 12:21 AM

ఆర్డీఓ జనార్దన్ రెడ్డి 

కల్వకుర్తి అక్టోబర్ 16 : వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వ పరంగా విద్యతో పాటు నాణ్యమైన భోజనాలను అందించడం జరుగుతుందని కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎస్టి ఆశ్రమ బాలికల విద్యాలయంలో వర్కర్లు లేకపోవడంతో సరిగ్గా భోజనం అందడం లేదంటూ కొన్ని రోజుల విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు.

ఈ సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా డిటిడిఓ ఫిరంగి, కల్వకుర్తి ఎ మ్మార్వో ఇబ్రహీంతో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు వెంటనే ఏర్పాటు చేయించి విద్యార్థులతో మాట్లాడారు.

త్వర లోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులుపాల్గొన్నారు.