13 May, 2026 | 4:44 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

మిమ్మల్ని రాజకీయాలకు వాడటమేంటి?

22-07-2025 12:17 AM

ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు

న్యూఢిల్లీ, జూలై 21: కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతికి సమన్లు జారీ చేయ డాన్ని క్వాస్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఈడీ సుప్రీంలో సవాలు చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలని పేర్కొంది. అలాంటి పోరా టాలకు ఈడీని ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించింది.

ఆయన హైకోర్టు జస్టిస్.. మర్యాద ఇవ్వండి

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషనర్ తరఫు న్యా యవాదిని సుప్రీంకోర్టు మందలించింది. ఒక హైకోర్టు న్యాయమూర్తిని వర్మ అని ఏకవచనంతో న్యాయవాది సంబోధించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ‘ఆయన మీకు స్నేహితు డా? ఆయనే ఇప్పటికీ జస్టిస్ వర్మే. మీరు ఆయనను మర్యాద లేకుండా సంభోదిస్తారా? ’ అని బీఆర్ గవా య్ ప్రశ్నించారు. కాగా జస్టిస్ వర్మ పై నమోదైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది.