calender_icon.png 20 June, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘భూ భారతి’తో వెతలు తీరేనా?

20-06-2025 12:15:08 AM

  1. రెవెన్యూ సదస్సుల్లో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

సమస్యలు పరిష్కరించాలని రైతుల విజ్ఞప్తి

చిగురుమామిడి, జూన్ 19(విజయక్రాంతి):  భూ సమస్య ల పరిష్కారమే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది. ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారం కాని రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చి గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది. సమస్యలు ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది.

ఈ మేరకు రైతులు, భూ యజమానులు తమ సమస్యలపై అధికారుల ముందు గోడు వెళ్ళబోసుకుంటున్నా రు. ప్రధానంగా పట్టా పాసుబుక్, నాలా, హ ద్దులు తదితర సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందజేశారు. వీటిని పరిశీలించి రెండు నెలల్లోగా పరిష్కరించే దిశ గా చర్యలు తీసుకుంటామని అధికారులు చె ప్తున్నారు.

కాగా నేటితో సదస్సులు ముగియ యనుండగా ఈ భూ భారతి తో నైనా తమ సమస్యలు పరిష్కామవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం  ఏళ్లకు ఏళ్ళు పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చ ట్టాన్ని తీసుకొచ్చింది.ప్రజల వద్దకు రెవెన్యూ నినాదంతో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది.

ఈ కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్వో ఆర్ మా ర్పులు, చేర్పులు, సాధాబైనామా నిషేధిత భూములు, తదితర సేవలు సులభం కానున్నాయి. పరిష్కారం కానున్నాయి. ఈ దిశగా ఈ నెల 3 నుంచి 20 వరకు గ్రామాల వా రీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. తరలిన అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభు త్వం భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 3నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది.

దీంతో అధికార యంత్రాంగమంతా కదిలింది.  తహసీల్దార్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పంచాయతీ కార్యదర్శు లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మండలంలో ఇప్పటి వరకు 2473 దఖాస్తులు     చిగురుమామిడి మండలంలో ఈ నెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాగా, తొలుత కొండాపూర్ గ్రామంలో నిర్వహించారు.

ఈ సదస్సులో 33 దరఖాస్తులు రాగా, ఇందుర్తిలో రెండు రోజులు ఏర్పాటు చేసిన సద స్సులో రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సదస్సులో 778 దరఖాస్తులు వచ్చాయి.

కాగా, ఇప్పటివరకు ముల్కనూర్లో 97, చిగురుమామిడిలో 462, నవాబుపేటలో 109, రేకొం డలో 279, బొమ్మనపల్లిలో 182, సుందరగిరిలో 330, రామంచలో 144, ముదిమా ణిక్యం లో 59 దరఖాస్తులు వచ్చాయి. కాగా రెవెన్యూ యంత్రాంగం అంతా కదిలి వచ్చి సమస్యలు వినడంతో శాశ్వత పరిష్కారం లభించునుందని రైతులు, భూ యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.