10 May, 2026 | 10:17 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

తాగునీటి కోసం మహిళల నిరసన

21-09-2025 12:00 AM

రహదారిపై ఖాళీ బిందెలతో ఆందోళన

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 20 (విజయక్రాం తి): ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలోని కాగజ్‌నగర్ మండలం వంజీరి గ్రామ పంచాయతీ మహిళలు మంచినీటి ఎద్దడి తీర్చాలంటూ ఆందోళన చేపట్టారు. శనివారం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమీపంలో ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. గత కొన్ని రోజులుగా కుళాయిల ద్వారా నీటి సరఫరా లేక తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు ఆరో పించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కోట ప్రసాద్ గ్రామస్థులతో మాట్లాడారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ ధర్నా చేయడం సరికాదని, నీల్లు సరిపోకపోతే అదనంగా ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీ పరిధిలోని సిఆర్ నగర్, మహజన్ గూడ గ్రామాల్లో బోరుబావులు లేనం దున మంజూరు చేయించవలసినదిగా మహిళలు కోరారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో భరో సా ఇచ్చారు. 

రూరల్ సీఐ కుమారస్వామికి గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.  అధికా రుల స్పష్టమైన హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది.