10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు

16-08-2024 03:28 PM

యాదాద్రి భువనగిరి: శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా పవిత్రోత్సవాలు కోనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిత్య కైంకర్యముల అనంతరం నవకలశ స్నపనం అళహ సింగర్ (ఉత్సవ మూర్తులకు) వైభవముగా జరిగింది.

యాగశాలలో చతుస్థానార్చనలు, మహా కుంభ ఆరాధనలు, మండలరాధన, విశేష హోమములు పూర్తి కాగానే మహా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. శ్రీ స్వామి వారికి పవిత్ర మాలికా ధారణ మహోత్సవం అత్యంత వైభవముగా జరిగినది. ఆ తరువాత అర్చక, పరిచారిక, పాచక, దేవస్థాన ఉద్యోగులకు, భక్తులకు పవిత్ర ధారణ చేసారు.