16-08-2024 03:33:37 PM
సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ మాణిక్ రావు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావును రాజీనామా చేయమనడం తగదని ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటిని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ నాయకులు బుచ్చిరెడ్డి తదితరులున్నారు