17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం

19-05-2025 12:00 AM

యాదాద్రి భువనగిరి, మే 1౮ (విజయ క్రాంతి) :  యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పై వెలసిన  స్వయంభూడు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోవడానికి యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవుల కు తోడుగా ఆదివారం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదు నగరం నుండి వందలాదిమంది భక్తులు కుటుంబ సభ్యులు, బంధువులతో వివిధ వాహనాలలో యాదగిరి క్షేత్రానికి చేరుకున్నారు.

పార్కింగ్ కార్లతో నిండిపోయింది. ఎండ తీవ్రత లేకపోయినా వేడి ఎక్కువగా ఉండడంతో  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొండపైన వేసిన తివాచీలు సరిపడకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

ఎండాకాలం పూర్తయ్యేంతవరకు కొండపైన తివాచీలు ఎక్కువగా వేయాలని భక్తులు డిమాండ్ చేశారు. భక్తులతో క్యూలైన్లు బార్లు తీరాయి. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది.  విఐపి లకు ప్రత్యేక దర్శనాలు ఆశీర్వచనాలు ఉండడంతో సామాన్య భక్తుల దర్శనానికి సమయం పట్టడంతో భక్తులు  అసహనానికి గురయ్యారు.