17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వందేమాతరం మనందరికీ స్ఫూర్తి మంత్రం: ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి

07-11-2025 08:27 PM

చేగుంట: వందేమాతర గేయం భారతీయులు అందరికీ స్ఫూర్తి మంత్రమని ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సామూహిక గేయాలాపనలో ఎస్ఐ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం గేయం భారతీయులను ఏకం చేస్తూ, బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి ఆయుధంగా మారిందని అన్నారు. మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ, మహనీయుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.