19-06-2025 01:26:42 AM
తాడ్వాయి జూన్, 18( విజయ క్రాంతి ): ఆరోగ్యం బాగు కోసం ప్రతిరోజు యోగా చేయాలని డాక్టర్ చైతన్య తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఉపాధ్యాయులకు యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యోగా చేసినట్లయితే మానసికోల్లాసం,ఆరోగ్యం బాగుపడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యానికి కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యోగ ప్రతినిధులు స్రవంతి, అజయ్ తదితరులు పాల్గొన్నారు