4 April, 2026 | 2:57 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

ఉరి వేసుకొని యువకుడు మృతి

05-10-2025 04:44 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని క్లబ్ రోడ్డులోని లంబాడి తాండాకు చెందిన రాతోడ్ మణికంఠ(20) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఎస్సై సురేష్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మంచిర్యాలలో ఐటిఐ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత పది రోజుల నుండి ఇంట్లో తల్లితండ్రులను బైక్ కోనివ్వమని వెంటపడుతున్నాడు.. నిన్న సాయంత్రం కూడా బైక్ కొనియ్యాలని కోరగా తల్లితండ్రులు తర్వాత కొనిస్తామని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి దారాసింగ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.