వడ్ల కుప్పతో... ఓ నిండు ప్రాణం బలి తీసింది
నిజామాబాద్ జిల్లా మోస్రాలో చోటు చేసుకున్న ఘటన
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా మోస్ర శివారులో వడ్ల కుప్ప ఓ నిండు ప్రాణం తీసింది. పోలీసులు ఎంత హెచ్చరించిన కొంత మంది రోడ్ల పైనే వడ్లు ఎండపెడుతున్నారు. వడ్ల కుప్ప పై జరిగిన ప్రమాదంలొ దేవి రెడ్డి అనే యువతి మృతి చెందింది. నిజామబాద్ పట్టణంలోని నాందేవ్వాడకు చెందిన యువతి దేవిరెడ్డి మోస్రాలో శుభ కార్యానికి తన బంధువుల ఇంటికి సోదరితో కలిసి వెళ్ళింది.
వీరు స్కూటీ పై తిరిగి నిజామాబాద్ కు వెళ్తుండగా ఎదురుగా వాహనం రాగానే దారిలేక రోడ్డుపై ఎండ పెట్టిన వడ్ల కుప్ప పైకి వీరి స్కూటీ ఎక్కింది. వెనుక కూర్చున్న దేవి రెడ్డి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి సంబంధించి వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






