13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

యువత వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలి

13-01-2026 01:03 AM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, జనవరి౧౨ (విజయక్రాంతి): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జిల్లా ప్రజలకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావు ల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, డా. మల్లికార్జున్ రెడ్డి, ముత్యం రెడ్డి, అచ్యుత్ రావ్, పట్టణ అధ్యక్షులు కార్తీక్, సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు భూపతి రెడ్డి, ఏడిపెల్లి నరేందర్, పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.