17 April, 2026 | 8:27 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

23న ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ 5కే రన్

21-11-2025 12:00 AM

ఖైరతాబాద్; నవంబర్ 20 (విజయ క్రాంతి) :  శాంతి  నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈనెల 23న  పీస్ 5కే రన్ ను నిర్వహిస్తున్నట్లు స్వయం సిద్ధి ఫౌండేషన్  నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గురువారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  రన్ కు సంబంధించిన కరపత్రాన్ని శ్రీధర్ యాలాల, మోడల్ మీను సింగ్  లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. నగర ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించడంతోపాటు  ప్రపంచం మొత్తం శాంతి సామరస్యాలతో కొనసాగాలని ఈ రన్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

23న నెక్లెస్ రోడ్ లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ లు హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. బతుకమ్మ కుంట నుంచి ప్రారంభమయ్యే రన్ పీపుల్స్ ప్లాజా కు చేరుకొని తిరిగి బతుకమ్మ కుంటకు చేరుకుంటుం దని తెలిపారు. రన్‌లో విజయం సాధించిన మొదటి ముగ్గురికి నగదు బహుమతి తో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు. రన్ లో పాల్గొనదలచిన వారు 7842893344, 7207827160 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రియా, న్యాయవాది సత్యనారాయణ, బిజిగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.