31 March, 2026 | 3:19 AM

వెలుగులోకి 2781 మంది

03-12-2024 12:50 AM

ఖేలో ఇండియా ప్రభావం 

మంత్రి మన్‌సుఖ్ మాండవీయ

న్యూఢిల్లీ: ఖేలో ఇండియా పథకం వల్ల రికార్డు స్థాయిలో 21 క్రీడాంశాల నుంచి 2781 మంది అథ్లెట్లు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. వీరిలో పారా అథ్లెట్లు కూడా ఉన్న ట్లు ఆయన తెలిపారు. ‘ఖేలో ఇండియా అథ్లెట్లలోని ప్రతిభను వెలికి తీసింది. ఖేలో ఇండి యా మార్గదర్శకాలను బట్టి 21 క్రీడాంశాలకు చెందిన వేలాది మంది అథ్లెట్లు వెలు గులోకి వచ్చారు’ అని మంత్రి లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు.