చిత్ర పరిశ్రమతో పాటు సమాజ శ్రేయస్సు కోసం ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తాను భాగమవుతుంటారు కథానాయకుడు ప్రభాస్. అందుకోసం తనవంతుగా ఆర్థిక సహాయం అందిస్తుంటారు ఆయన. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కు ప్రభాస్ 35 లక్షల విరాళం అందించారు. దర్శకుల సంఘం సంక్షేమం కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఇటీవల తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన డైరెక్టర్స్ డే ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి ఈ విషయాన్ని సంఘం సభ్యులకు తెలియజేశారు. 35 లక్షల విరాళం అందించిన ప్రభాస్కు డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
దాసరి జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుక
మే 4న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే వేడుకలను ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నామని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశం కర్ తెలిపారు. మే 4న జరగబోయే ఈ కార్యక్రమాన్ని బ్లాక్బస్టర్ వేడుకలా చేయాల్సిన బాధ్యత దర్శకులందరిపై వుందని దర్శకుడు హరీశ్శంకర్ తెలిపారు.