2 July, 2026 | 12:21 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

పెద్దపులి దాడిలో ఆవు మృతి

17-12-2025 12:45 AM
  1. కామారెడ్డి జిల్లాలో ఘటన

భయాందోళనలో ప్రజలు

కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): దోమకొండ మండలంలోని  అంబారిపేట శివారులో దూడలపై పెద్దపులి దాడి చేసినట్లు అక్కడి రైతులు పేర్కొన్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి డబుల్ బెడ్ రూం సముదాయం నుంచి మాందాపూర్ వెళ్లేదారిలో ఆకుతోట రామచంద్రం వ్యవసాయ క్షేత్రంలో మరోమారు పులి సంచారం ఆందోళనకు గురిచేసింది. సోమవారం రాత్రి ఓ ఆవుపై దాడి చేసి చంపేసినట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ  పెద్దపులి సంచరించిన ప్రాంతంలో ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో పెద్దపులి కదలికలు రికార్డు అయినట్లు తెలుస్తోంది.