07-11-2025 05:02:13 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తిలో వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులతో పోలీసులు అధికారులు మమేకమై వందేమాతరం గీతంతో శుక్రవారం మెయిన్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని, వందేమాతరం గేయం పాడుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తహశీల్దార్ దయానందం, ఎస్ఐ క్రాంతి కుమార్ లో మాట్లాడుతూ యువత సమాజసేవలో రాణిస్తూ దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అశోక్ కుమార్, పిడి యాకయ్య మాజీ సర్పంచ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది విద్యార్థులు, పాల్గొన్నారు.