2 July, 2026 | 2:28 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

పండగ పూట తీవ్ర విషాదం

10-08-2025 12:00 AM

-రాఖీ కట్టించుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

- అక్కడికక్కడే యువకుడు మృతి 

నిజామాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సోదరితో రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణమైన యువకుడిని కంటైనర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన సాయి బబ్లూ (21) సోదరి నిజామాబాద్ నగరంలోని రోడ్డులో అత్తారింటిలో ఉండ గా.. శనివారం బాసర నుంచి మరో యువకుడితో కలిసి బైక్‌పై వచ్చాడు. అక్కతో రాఖీ కట్టించుకుని బైక్‌పై తిరిగి బాసర వెళ్తుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద కంటైనర్ ఢీకొట్టింది. బబ్లూ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.