13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న ప్రేమ

08-01-2026 12:04 AM

ఎల్బీనగర్, జనవరి 7 : తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తినే పెండ్లి చేసుకుంటానని పట్టుపట్టడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 6న మైనర్ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఓ వెంచర్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకునన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని మహేశ్ (21) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతను యాచారం మండలానికి చెందిన బంధువుల అమ్మాయి పూజ(17)ని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసి, మందలిం చడంతో ఈ నెల 6న మైనర్ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి ఉరేసుకున్న విషయం తెలుసుకున్న మహేశ్ తీవ్ర మనస్తాపం చెందాడు.

దీంతో బ్రాహ్మణపల్లి గ్రామంలోని జనచైతన్య వెంచర్‌లో బుధవారం ఉదయం నిప్పంటించుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృ తుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.