19 May, 2026 | 10:20 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న ప్రేమ

08-01-2026 12:04 AM

ఎల్బీనగర్, జనవరి 7 : తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తినే పెండ్లి చేసుకుంటానని పట్టుపట్టడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 6న మైనర్ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఓ వెంచర్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకునన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని మహేశ్ (21) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతను యాచారం మండలానికి చెందిన బంధువుల అమ్మాయి పూజ(17)ని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసి, మందలిం చడంతో ఈ నెల 6న మైనర్ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి ఉరేసుకున్న విషయం తెలుసుకున్న మహేశ్ తీవ్ర మనస్తాపం చెందాడు.

దీంతో బ్రాహ్మణపల్లి గ్రామంలోని జనచైతన్య వెంచర్‌లో బుధవారం ఉదయం నిప్పంటించుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృ తుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.