15 June, 2026 | 11:44 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఇంట్లో కనిపించిన శ్వేతనాగుపాము

19-12-2025 12:32 AM

తండోపతండాలుగా వచ్చి చూస్తున్న జనాలు 

అయిజ, డిసెంబర్ 18: జోగులాంబ గద్వాల జిల్లా అయిజలోని రంగు పేట వీధిలో వేణుగోపాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్న పాత ఇంట్లో శ్వేతనాగు పాము కనిపించింది.భయం కంపితులై ఇంట్లోని వారు ఒక్కసారిగా బయటకు వచ్చి జనాలకు తెలియజేశారు.

తెల్లనాగుపాము కావడంతో జనాలు తండోపతండాలుగా వచ్చి చూడడం వింతగా అనిపించింది.అయిజలోని పాములను పట్టే ఒక ముస్లిం వ్యక్తి వచ్చి దానిని నేర్పుగా పట్టి అడవిలో వదిలి పెట్టాడాని ఇంటియజమాని వేణుగోపాల్ అన్నారు. గతంలో కూడా చాల పాములు వచ్చాయని మునిసిపాలిటీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు.