22 June, 2026 | 8:05 PM

Breaking News

బెల్లంపల్లి ఆసుపత్రి ఎదుట..   •   ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్, బీజేపీ నాయకులు..   •   పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •  

గట్టు దుద్దెనపల్లి యువకుడికి భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా

20-10-2025 12:00 AM

మానకొండూర్, అక్టోబర్ 19: (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా మనకొండూరు మండలం గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన గట్టు రమేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందారు. గట్టు ఎల్లయ్య గౌడ్, శ్రీమతి లక్ష్మి దంపతుల కుమారుడైన రమేష్ పరిశోధనను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి రేడియోథెరపీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. కృష్ణమూర్తి పర్యవేక్షణలో పూర్తి చేశారు.

ఆధునిక కాన్ఫార్మల్ రేడియోథెరపీ చికిత్సలలో డోస్ డెలివరీలో చోటుచేసుకునే తప్పిదాల విశ్లేషణ అనే శీర్షికతో రూ పుదిద్దుకున్న ఈ థీసిస్లో రేడియోథెరపీ చికిత్స సమయంలో మోతాదు పంపిణీలో జరిగే లో పాలు, వాటి ప్రభావం, నివారణ చర్యలు మరియు నాణ్యత నియంత్రణ పైన దృష్టి సారించారు. మెడికల్ ఫిజిక్స్ రంగానికి ఈ పరిశోధన ఉపయోగకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.సాధారణ కుటుంబానికి చెందిన రమేష్ పట్టుదలతో ఉన్నత విద్యను అందిపుచ్చుకోవడం గ్రామానికి, జిల్లాకు గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం మరియు కిమ్స్ రేడియోథెరపీ బృందం ఆయనకు అభినందనలు తెలిపారు. డాక్టర్ రమేష్ పరిశోధన ఫలితాలు మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, డోసిమెట్ట్రిస్టులు మరియు కేన్సర్ రేడియోథెరపీ నిపుణులకు మార్గదర్శకంగా నిలుస్తాయని వెల్లడించారు.భవిష్యత్తులో మెడికల్ ఫిజిక్స్, రేడియోథెరపీ క్వాలిటీ అష్యూరెన్స్ రంగాలలో మరిన్ని శోధనలతో విజయాలు సాధించాలని శుభాకాంక్షలుతెలిపినారు.