22-09-2025 01:12:40 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): విద్యార్థుల ఆశయాల ప్రతినిధి, ఏకైక శక్తి ఏబీవీపీ మాత్రమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ ప్యానెల్ ఘన విజయం సాధించడంపై ఆయన అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. అలజడి సృష్టించే వామపక్ష, విభజనశక్తులకు గట్టి సమాధానం ఈ విజయమని పేర్కొన్నారు. ఏబీవీపీ దేశభక్తి, జాతీయవాదం, విద్యార్థి సంక్షేమం.. ఈ మూడు స్తంభాలపై పని చేస్తోందని తెలిపారు. వర్సిటీలో 12 విద్యార్థి సంఘాలు ఉన్నా, ఏబీవీపీ తప్ప ఎవరూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేదని తెలిపారు.