మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ పత్రాల స్వీకరణ

30-04-2024 12:33:34 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ పత్రాల స్వీకరించనున్నట్టు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. సోమవారం జనగామ కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్ పత్రాల స్వీకరణపై మాస్టర్ ట్రైనర్లతో పవర్‌పాయిం ట్ ప్రజంటేషన్ ద్వారా తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 3 నుంచి 6 వరకు నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ పత్రాలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గంలోని ఆర్‌వో కార్యాల య పరిధిలో ఫెసిలిటీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జడ్పీ సీఈవో అనిల్‌కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.